భారత్ సమాచార్.నెట్: వివాదాస్పద వ్యాఖ్యలతో మరో స్టాండప్ కమెడియన్(Standup Comedian) వార్తల్లో నిలిచారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్దేవా (Swati Sachdeva) తన తాజా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన తల్లితో చేయకూడదని సంభాషన చేసినట్లు ఓ షోలో ఆమె పేర్కొన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రేక్షకులను నవ్వించేందుకు అసభ్యకర విషయాలను ఎంచుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అనుచిత కామెడీని ప్రోత్సహించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
స్వాతి సచదేవా వ్యాఖ్యలు..
తాజాగా జరిగిన ఓ స్టాండ్-అప్ కమెడియన్ షోలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవలే నా తల్లితో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన తల్లి నా దగ్గరకు వచ్చి ‘స్నేహితురాలిగా’ తనతో మాట్లాడమని అడిగింది. ఆమె కచ్చితంగా వైబ్రేటర్ను చూపించి దానిని గాడ్జెట్ లేదా బొమ్మ అని చెప్పినట్లు వివరించింది. అయితే దానికి నేను, అమ్మా.. ఇది నాన్నది అని సమాధానం ఇచ్చినట్లు చెప్పింది. దానికి అమ్మ మూర్ఖంగా మాట్లాడకు, ఆయన గురించి నాకు తెలుసు అని, అది ఆయన సెలక్షన్ కాదని చెప్పినట్లు చెప్పింది. ఆ తర్వాత అమ్మ దాన్ని తీసి నన్ను ప్రశ్నించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చింది. ఇక దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా.. మరికొందరు తీవ్రంగా మండిపడుతున్నారు.
రణ్వీర్ అలహాబాదియా, కునాల్ కమ్రా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం..
ఇటీవల ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ వేదికగా యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించడంతో, అతడిపై పలు కేసులు కూడా నమోదైయ్యాయి. అలాగే స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే (Eknath Shinde)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు డీరి జాబితాలో స్వాతి సచ్దేవా చేరారు.
హద్దులు దాటుతున్న కామెడీ..
ఈ తరహా ఘటనలు పెరుగుతుండటంతో, స్టాండప్ కమెడీలో హద్దులు తప్పుతున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో సంస్కృతిని కాపాడేందుకు కంటెంట్పై నియంత్రణ అవసరమని, స్టాండప్ షోలలో ఇలాంటి వ్యాఖ్యలకు తావివ్వకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.