Homebreaking updates newsఆ రెండు పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తున్నాయి

ఆ రెండు పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తున్నాయి

భారత్ సమాచార.నెట్, కరీంనగర్: ఉగాది (Ugadi) పండుగపూట కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi sanjay) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం నాడు కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముందుగా ప్రజలందరికీ విశ్వావసు నామా సంవత్సర శుభాకాంక్షలు (Ugadi Wishes) తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ సమృద్ధిగా ఆదాయం పెరగాలి.. సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని.. ప్రధాని మోదీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. దేశాన్ని విభజించేందుకు ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజకు కుట్ర చేస్తుందన్నారు. వీళ్లను రాళ్లతో కొట్టాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ అనే అవినీతి వైరస్ సోకిందని.. దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ.. ప్రజా ఆందోళన అనే వాక్సిన్ ద్వారా కాంగ్రెస్‌పై యుద్ధం చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇకపోతే రాబోయో రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కోటా కింద సన్నబియ్యం ఇస్తామని ప్రచారం చేసుకుంటుందని.. కానీ వాటిని ఇస్తుంది కేంద్రం అని చెప్పారు. ఒక్క కేజీ బియ్యం మీద కేంద్రం 40 రూపాయలు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్ చేసే ఖర్చు కంటే మూడు రెట్లు అదనంగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని.. అందుకే వెంటనే రేషన్ షాపులతో పాటు అంతటా ప్రధాని మోదీ ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments