Homebreaking updates newsఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. చికెన్ షాపులకు క్యూ కట్టిన జనం

ఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. చికెన్ షాపులకు క్యూ కట్టిన జనం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) చికెన్ ధరలు (Chicken Prices) భారీగా పెరిగాయి. రంజాన్ (Ramzan) పండుగ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. దీంతో మాంసం దుకాణాల్లో (Meat Shops) పొద్దున నుంచే ఫుల్ రష్ ఉంది. కాగా బర్డ్ ఫ్లూ (Bird Flu) భయంతో గత వారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు తగ్గాయి. మళ్లీ నిన్న కేజీపై రూ.50 నుంచి రూ.70 పెరగ్గా, ఇవాళ ఆ ధరలూ మరింత ఎక్కువ అవడం గమనార్హం.
గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కారణంగా.. చికెన్, మటన్ దుకాణాల్లో కస్టమర్లు లేక వెలవెలబోయాయి. రెండు నెలల క్రితం వరకు కేజీ చికెన్ రూ. 240 వరకు ఉండగా.. బర్ల్ ఫ్లూ భయంతో వాటి ధరలు రూ.120-150 మధ్యకు పడిపోయాయి. ప్రజలు చికెన్‌కు బదులు చేపలు, మటన్ వంటి వాటిని తినేందుకు మెుగ్గు చూపారు. దీంతో చికెన్ వ్యాపారులు రెండు నెలలుగా దివాళా తీశారు. గిరాకీ లేక ఇబ్బందులు పడ్డారు. విక్రయాలు సగానికిపైగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే బర్డ్ ఫ్లూ భయాలు తొలిగి పోతుండటంతో మళ్లీ చికెన్ విక్రయాలు ఊపందుకున్నాయి.
పండగ నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతం పెరిగి రూ. 300 వరకు చేరుకున్నాయి. వాస్తవానికి ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ నిన్న ఆదివారం ఉగాది కావడంతో జనలంతా మాంసానికి దూరంగా ఉన్నారు. ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేశారు. ఇక ఇవాళ రంజన్ పండుగా.. ఆదివారం ఉగాది సందర్భంగా మాంసానికి దూరంగా ఉన్న చాలా మంది నేడు నాన్ వెజ్ షాపులకు క్యూ కట్టారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments