భారత్ సమాచార్.నెట్, వైజాగ్: ఏపీలోని విశాఖ (Visakhapatnam)లో ఉన్న రామానాయుడు స్టూడియో భూముల (Ramanaidu Studio Landsను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు (Show-cause Notice) జారీ చేసినట్లు వైజాగ్ కలెక్టర్ హరీన్ధీర ప్రసాద్ చెప్పారు. ఈ నోటీసులకు సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. నోటీసులపై రిప్లై ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కాగా, రామానాయుడు స్టూడియోకు చిత్ర నిర్మాణ పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం.. 34 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించింది.
అయితే రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములు దర్వినియోగం అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విశాఖ వేదికగా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నాటి టీడీపీ ప్రభుత్వం 2003లో బీమిలి బీచ్ రోడ్డులోని 34.44 ఎకరాల భూమిని సురేష్ ప్రొడక్షన్స్కు కేటాయించింది.
అప్పట్లో ఉన్న మార్కెట్ రేటు కింద ఎకరాకు రూ.5.20 లక్షలను సురేశ్ ప్రొడక్షన్స్ ఇచ్చింది. దాదాపు 10 ఎకరాల్లో రామానాయుడు స్టూడియో నిర్మాణాలు జరిపారు. మిగితా భూములు దాదాపు 13 ఏళ్లుగా అలాగే ఉన్నాయి. స్టూడియోకు ఇచ్చిన భూములకు దగ్గరలో బావికొండ బౌద్ధ ప్రాంతం ఉందని తెలుపుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. సీఆర్జడ్ రూల్స్ను కూడా ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఆ భూములను స్టూడియో కోసమే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేఅవుట్లపై గత ఏడాది ఫిబ్రవరి 9న స్టే విధించింది.