భారత్ సమాచార్.నెట్: బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి (Price Drops). గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Rates) భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కానీ మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు గోల్డ్ కొనేందుకు మంచి ఛాన్స్ లభించినట్లు అయ్యింది. శుభకార్యాలు సమీపిస్తున్న నేపథ్యంలో, ధరలు తగ్గుతుండటంతో గోల్డ్ కొనుగోలుపై ప్రజలు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు.
బులియన్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.900 తగ్గి రూ.83,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.980 తగ్గి రూ.90,660గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం నాటికి గ్రాము బంగారం ధర రూ.8,399గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.83,990గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 9,163గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.91,630గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. పరస్పర సుంకాల నేపథ్యంలో బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరుగుతూ పోయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా పసిడి ధరలు కుప్పకూలిపోయాయి. తాజాగా భారీగా పడిపోవడం విశేషం. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడటంతోనే రేట్లు దిగొస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుపై (31.10 గ్రాములు) కిందటి రోజు ఉదయం ఏకంగా 3100 డాలర్ల లెవెల్స్లో ఉండగా.. ఇప్పుడు అది 3038 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా కిలోకు ఈ స్థాయిలోనే పతనం కావడంతో.. దేశీయంగా ఈ ధరలు భారీగా తగ్గాయి.