భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)-సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)ల కాంబినేషన్లో వచ్చిన చిత్రం కల్కి (Kalki 2898 A.D). గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మైథలాజికల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ (Block Buster Hit)గా నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఓవరాల్గా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. ప్రస్తుతం పార్ట్ 2కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి.
తాజాగా కల్కి 2కు సంబంధించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలోని పాత్రలపై ఇంకా పని జరుగుతోందని.. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. సుమతి, అశ్వత్థామ పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నామని.. ఆ పాత్రలను ప్రేక్షకులకు మరింత ఇంపాక్ట్ ఫుల్గా, ఎంగేజింగ్గా చూపించబోతున్నామని వివరించారు. తదుపరి షెడ్యూల్ గురించి మాట్లాడుతూ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నామని చెప్పిన నాగ్ అశ్విన్.. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇకపోతే కల్కి ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించడంతో.. సెకండ్ పార్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మహాభారతం ఆధారంగా రూపొందుతున్న పాత్రల వల్ల ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఫ్యాన్స్ మాత్రం రెండో భాగం షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా కల్కి సినిమాలో సుమతి (దీపికా పదుకొనే) అపహరణకు గురువుతుంది. దీంతో ఆమెను కాపాడటానికి అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్), భైరవ/కర్ణ (ప్రభాస్) బరిలోకి దిగుతారు. ఇప్పుడీ సీక్వెన్స్ మరింత హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ పోషించిన కమాండర్ యాస్కిన్ పాత్ర సినిమాకు హైలెట్గా నిలిచింది. సీక్వెల్లోనూ కమల్ రోల్ మరింత పవర్ ఫుల్గా ఉండనుందని తెలుస్తోంది.