HomeCM ViewMadhya Pradesh: చోరీ తప్పే.. మన్నించండి.. మంచి దొంగ వినతి

Madhya Pradesh: చోరీ తప్పే.. మన్నించండి.. మంచి దొంగ వినతి

భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. అప్పుల భారంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన ఓ యువకుడు ఆదివారం అర్థరాత్రి ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. కానీ అతని చర్య ఇక్కడితోనే ఆగిపోలేదు. తనను క్షమించాలని కోరుతూ, డబ్బును ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తానని స్పష్టం చేశాడు. చోరీ చేసిన ప్రాంతంలోనే టైప్ చేసిన లెటర్ ను అక్కడే వదిలివెళ్లడం వైరల్ గా మారింది. పోలీసుల కథనం ప్రకారం, స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు దోచుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన యజమాని.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అక్కడే ఓ లేఖ దొరకింది.‘చోరీ చేయాలన్న ఉద్దేశం లేదు. అప్పుల వాళ్ల బాధ తాళలేకనే ఇలా చేస్తున్నా. నాకు అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తాను. అప్పటివరకు దయచేసి సమయం ఇవ్వండి’’ అని ఆ లెటర్ లో పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు.ఇకపోతే, వ్యాపారి కథనం ప్రకారం, తన వద్ద మొత్తం రూ.2.84 లక్షలు ఉన్నప్పటికీ, రూ.2.45 లక్షలు మాత్రమే మాయమైనట్లు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments