భారత్ సమాచార్.నెట్: ప్రతి శుక్రవారం థియేటర్లో సినిమాల (Movies) సందడి ఉంటుంది. గడిచిన వారంలో గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly), జాక్ (Jack), జాట్ (JAAT), అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాలొచ్చాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాగా.. మరికొన్ని నిరాశను మిగిల్చాయి. ఇక ఈ వారంలో కూడా థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉండనుంది. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త సినిమాలు రాబోతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్స్తో పాటు హారర్ థ్రిల్లర్ (Horror Thriller) మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి.
ఏప్రీల్ 18న శుక్రవరం ఓ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi) ఈ నెల 18వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బులసు ఈ సినిమాను నిర్మించారు.
ఇక తమన్నా డిఫరెంట్ రోల్లో మెయిన్ లీడ్లో నటించిన ‘ఓదెల 2’ (Odela)మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది. ఇందులో భైరవిగా శివశక్తి పాత్రలో తమన్నా కనిపించనుంది. దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్ తేజ ఈ చిత్రాన్ని రూపొందించారు. డి. మధు ఈ మూవీని నిర్మించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కేసరి 2’. 1919లో అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్ కానుంది.
రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీ రీ రిలీజ్ కానుంది. దర్శకుడు ఎస్. గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం రవితేజ కరీర్లోనే వెరీ స్పెషల్. ఏప్రిల్ 18న రీ రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్గా నిలిచాయి. ఇక ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే.. నెట్ ఫ్లిక్స్ – ది గ్లాస్ డోమ్ (వెబ్ సిరీస్ – ఏప్రిల్ 15), ఐ హోస్టేజీ (మూవీ – ఏప్రిల్ 18)