భారత్ సమాచార్.నెట్, శబరిమల: కోలీవుడ్ స్టార్స్ కార్తి (Karthi), జయం రవి (Jayam Ravi) శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి (Ayyapa swamy)ని దర్శించుకున్నారు. ఇటీవలే తొలిసారిగా అయ్యప్ప మాల (Ayyapa Mala) వేసుకున్న కార్తి.. నటుడు జయం రవితో కలిసి శబరిమల క్షేత్రానికి వెళ్లారు. ఇరుముడి (Irumudi)తో శబరిమలకు వెళ్లిన కార్తీ, జయం రవిలు అయ్యప్పను దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి.
దర్శననంతరం నటుడు కార్తి మాట్లాడుతూ.. ఇరుముడి కట్టుతో శబరిమల కొండపైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. కన్నె స్వామిగా ఇక్కడికి వచ్చాను. పవళింపు సేవల స్వామివారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. భవిష్యత్తులోనూ స్వామి వారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను అని కార్తి మీడియాతో అన్నారు. ఇక జయం రవి మాట్లాడుతూ.. తాను ఇదివరకే చాలాసార్లు శబరిమల ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. ‘నేను 2015 నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు తొమ్మిదిసార్లు శబరిమలను దర్శించుకున్నాను. స్వామిపై నాకు ఎంతో నమ్మకం ఉంది. నా జీవితంలో చాలా మంచి సంఘటనలు చోటు చేసుకున్నాయి’ అని వివరించారు.
ఇకపోతే నటుడు కార్తి ప్రస్తుతం సర్దార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా ఆయన వా వాతియార్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది, నలన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2, దర్శకుడు సుందర్ సితో ఒక సినిమా, మారి సెల్వరాజ్తో ఒక సినిమా చేస్తున్నారు. మరోవైపు జయం రవి కూడా సినిమా షూటింగ్ల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కరాటే బాబు సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డాడీ సినిమా దర్శకుడు గణేష్ కె బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పరాశక్తి అనే సినిమా కూడా ఆయన చేయనున్నట్లు తెలుస్తోంది. .