భారత్ సమాచార్.నెట్: భారత్ (India), అమెరికా (America) మధ్య టారిఫ్(Tariff)ల అంశంపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెస్లా అధినేత (Tesla Ceo), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donal Trump) పరిపాలనలో డోజ్ విభాగం అధిపతిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elonmusk)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తెలిపారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ ఏడాది వాషింగ్టన్లో ఎలాన్ మస్క్తో చర్చించిన అంశాలు ప్రస్తావించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణల్లో సహకారంపై మస్క్తో మాట్లాడినట్లు చెప్పారు. అమెరికాతో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు, మస్క్తో కూడా మోదీ భేటీ అయ్యారు.
ఎలాన్ మస్క్తో పాటు ఆయన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఎలోన్ మస్క్ ప్రధాని మోదీకి స్టార్షిప్ షడ్భుజ హీట్షీల్డ్ టైల్ను బహుమతిగా ఇచ్చారు. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతున్న వేళ ప్రధాని ఎలోన్ మస్క్తో ఫోన్లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ సంవత్సరం చివర్లో ఢిల్లీ, బెంగుళూర్, ముంబై నగరాల్లో టెస్లా ఎలక్ట్రానిక్ వాహనాల సేల్స్ ప్రారంభించాలని చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది.