Homebreaking updates newsPope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

భారత్ సమాచార్.నెట్: కేథలిక్‌ల అత్యున్నత మత గురువు (Catholics Religious Head) పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) (88) కన్నుమూశారు (Passed Away). గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు వాటికన్ (Vatican) వర్గాలు ప్రకటించాయి. సోమవారం ఉదయం 7.35 గంటలకు పోప్‌ తన నివాసంలో మరణించారని పేర్కొంది. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియో, కిడ్నీ సమస్యలతో ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జ్ అయ్యారు.

ఆయన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్.  వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి ఆయన ప్రపంచం కోసం సందేశం చెప్పారు. ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్..!’ అని పోప్ స్వయంగా చెప్పారు. అనంతరం ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఆయన అనారోగ్యం పాలైన తర్వాత అంతమంది జనాల్లోకి రావడం ఇదే తొలిసారి. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించడం విశేషం. మధ్యలో ఆగి పసికందులను, చిన్నారులను ఆశీర్వదించారు.
ఇకపోతే 2013లో 16వ పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. 1938లో ఫ్రాన్సిస్‌ అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్‌ పదవిని తీసుకున్న తొలివ్యక్తి ఆయనే. ఆయన్ని ప్రజల పోప్ అని కూడా పిలుస్తారు. సామాజిక అంశాలపై కూడా ఫ్రాన్సిస్‌ తరచుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఆయన ఇతర మతానికి చెందిన శరణార్థులు పాదాలు కూడా కడిగారు. దీన్ని ఆయన వినయం, సేవకు చిహ్నంగా భావిస్తారు. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. భారత్ ప్రధాని మోదీ సైతం పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం తీవ్ర బాధ కలిగించిందని.. ఈ విషాద సమయంలో ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments