భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror attack) ఘటన అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ (India)కు రష్యా(Russia) అండగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి (Pm Modi) పుతిన్ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని పుతిన్ ఖండించారు. పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు.
ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు. అదేవిధంగా మే9న రష్యా విక్టరీ డే జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, రష్యా మధ్య ఈ ఏడాది జరగాల్సిన వార్షిక సదస్సు తమ దేశంలో నిర్వహించాలంటూ ప్రధాని మోదీ ఆహ్వానం పలకగా.. పుతిన్ ఇందుకు అంగీకరించారు.
మరోవైపు ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్థాన్ బూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్థాన్ను అష్ఠదిగ్బంధనం చేసి ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు ఇప్పటికే భారత్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే సిందూ జలాల ఒప్పందం, పాక్ దిగుమతులపై నిషేధం, పాక్ పౌరులు దేశాలను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలు ఇవ్వండా.. ఇలా పలు రకాలైన ఆంక్షలు భారత్ అమలు చేస్తోంది.