భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack)పై భారత్ ఆర్మీ (Indian Army) “ఆపరేషన్ సింధూర్”(Operation Sindoor) పేరుతో పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. భారత్ పాక్ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఏ క్షణం ఏం జరుగుతోందనని ఆసక్తిగా మారింది. ఓ వైపు భారత్ సైన్యం ఉగ్రమూకలను మట్టుబెట్టే పనిలో నిమగ్నమై ఉంటే.. ఆపరేషన్ సింధూర్ పేరుతో సినిమా (Movie) తీసి లాభాలు రాబట్టాలని బాలీవుడ్ (Bollywood) నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం.. ఒకట్రెండు కాదు.. దాదాపు పదిహేను నిర్మాణ సంస్థలు ఒక్కటే టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ టైటిల్కు సంబంధించిన హక్కులు పొందేందుకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వద్ద దరఖాస్తు చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థలైన టీ సిరీస్, జీ స్టూడియోస్ తదితర సంస్థలు కూడా ఈ టైటిల్ను సొంతం చేసుకునేందుకు ఆసక్తిగా ఉండటం విశేషం.
ఈ టైటిల్కు దరఖాస్తు చేసిన నిర్మాతల్లో ఒకరైన అకోశ్ పండిట్ మాట్లాడుతూ..”ఈ పేరుతో సినిమా నిర్మించేది ఖచ్చితమేనా?అన్నదాన్ని ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పేర్లు పెట్టాలనే ఉత్సాహం దర్శక, నిర్మాతల్లో సాధారణంగా ఉంటుంది. కేవలం పేరే అని తక్కువచేసిన సినిమాలు ప్లాన్ చేయలేం. ఇప్పటి సమకాలీన పరిస్థితులను బట్టి చూస్తే.. ‘ఆపరేషన్ సింధూర్’ అనే టైటిల్కు చాలా మంది దరఖాస్తు చేశారు అని తెలిపారు. కాగా ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసిన మొదటి సంస్థగా ‘మహవీర్ జైన్ ఫిల్మ్స్’ నిలిచింది. అయితే ఈ టైటిల్ను ఏ చిత్రనిర్మాతకు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.