భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా (Pahalgam Terror attack) భారత్ (India) ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో భారత్ సైన్యం (Indian Army) మిస్సైల్స్తో దాయాదిపై విరుచుకుపడింది. అయితే ఇప్పటివరకు ఈ నష్టంపై పెదవి విప్పని పాక్ (Pakistan) ఇప్పుడు స్పందించింది. పాక్పై దాడులు జరిగినట్లు అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) తెలిపారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మే 9-10 మధ్య రాత్రి సమయంలో రావిల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు తెలిపారు. భారత్ దాడులు ఎదుర్కొనేందుకు వైమానికి దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడి వినియోగించిందని మునీర్ తెలిపారని షెహబాజ్ వివరించారు. అయితే భారత్పై పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదని చెప్పారు.
ఇక ఇదే సమయంలో భారత్, పాకిస్థాన్లు కశ్మీర్ సహా తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని షెహబాజ్ షరీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్, పాక్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగిన వచ్చిందేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్కు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాగా పాక్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ధైర్యం, సామర్థ్యానికి షరీఫ్ మాటలు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.