Homebreaking updates newsNayantara: అనిల్ రావిపూడి చిత్రం.. చిరుతో జత కట్టనున్న నయనతార

Nayantara: అనిల్ రావిపూడి చిత్రం.. చిరుతో జత కట్టనున్న నయనతార

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో #మెగా157 సినిమా (Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunam) చిత్రం తర్వాత అనిల్ రావిపూడి,  భీమ్స్ (Bheems) కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చక చక జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ ప్రాజెక్టులో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో కాన్సెప్ట్‌తో హీరోయిన్‌కి వెల్కమ్ చెప్పారు. అందులో ‘వచ్చే ఏడాది సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అని నయన్‌తో కలిసి అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చివరిలో మెగాస్టార్ మేనరిజంలో ‘హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్‌ టర్నింగ్‌ ఇచ్చుకోమ్మా’ అంటూ నయన్, అనిల్ సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిరు కూడా నయన్‌ని టీమ్‌లోకి ఆహ్వానిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో చిరుతో కలిసి నటించిన నయనతార.. మరోసారి చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం.
RELATED ARTICLES

Most Popular

Recent Comments