భారత్ సమాచార.నెట్: భారత్ (India) , పాక్ (Pak) ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)లో భారీ పేలుళ్ల (Blasts)కు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఐసిస్ (ISIS)ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద లింక్లు ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్ వ్యాప్తంగా డమ్మీ పేలుళ్లకు పాల్పడేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారన్న పక్కా సమాచారం రావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్లు గుర్తించిన అధికారులు.. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇద్దరు సౌదీ అరేబియా కేంద్రంగా పని చేస్తున్న ఐసిస్ మాడ్యూల్ నుంచి ఆదేశాలు అందుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
కుట్రలో భాగంగా సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతోపాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లో పేలుళ్ల రిహార్స్ల్స్ నిర్వహించాలని నిర్ణయిచింనట్లు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకువడంతో వారి కుట్రకు బ్రేక్ పడింది. కాగా నిందితులిద్దరిని అధికారులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.