Homebreaking updates newsIndia-Pak: ఆసియా కప్‌కు భారత్ దూరం! 

India-Pak: ఆసియా కప్‌కు భారత్ దూరం! 

భారత్ సమాచార్.నెట్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor)తో భారత్ (India), పాక్ (Pak) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ (Asia Cup) టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియా (National Media) కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలికి భారత్ బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదురు కథనాలు పేర్కొన్నాయి.

దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమ్ ఇండియా.. ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇక జూన్‌ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ నిర్ణయిచినట్లు తెలుస్తోంది. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు.పాకిస్థాన్ క్రికెట్‌ను ఏకాకిని చేయాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ ఈవెంట్లకు ఉన్న స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉండడం గమనార్హం. కాగా, భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఆసియా కప్ ఉంటే.. ఆ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు బ్రాడ్‌కాస్టర్లు కూడా అంతా ఆసక్తి చూపించారు. దీంతో టీమిండియా లేకుండా ఆసియా కప్ నిర్వహించడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తు్న్నట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్ బ్రాడ్‌కాస్టింగ్‌ రైట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క ఇండియా దక్కించుకుంది. ఇప్పుడు ఈ టోర్ని జరగకపోతే ఆ డీల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments