భారత్ సమాచార్.నెట్: కరోనా (Corona) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సింగపూర్ (Singapore), థాయిలాండ్ (Thailand), హాంగ్కాంగ్ (Hong Kong) దేశాల్లో రోజుకు వేల కేసులు నమోదు అవుతుండటంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా (World Wide) ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో భారత్ (India)లోనూ కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 257 కేసులు నమోదు కాగా.. మే 12 నుంచి వారం రోజుల్లో 164 పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. అయితే ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హాంకాంగ్, సింగపూర్లో పెరుగుతున్న కరోనా కేసులు భారత్పై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన పాడాల్సిన అవసరం లేదని.. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని కేంద్రం సూచించింది.
ఇకపోతే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గత వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 44లో కేసులు నమోదు కాగా.. అందులో ఇద్దరు మరణించారు. అయితే కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికి అవి కోవిడ్ మరణాలు కావని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 56 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.