భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) తర్వాత భారత్ (India), పాక్ (Pak) మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా పాక్ విమానాలపై (Pakistan Airlines) భారత్ గగనతలంలోకి (Indian Airspace) ప్రవేశించడాన్ని నిషేధించిన (Entry Prohibited) సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని మరో నెల రోజుల () పాటు పొడిగించింది భారత్. అంటే ఈరోజు నుంచి జూన్ 23 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనల మేరకు ఇండియన్ నోటామ్ జారీ చేసింది.
ఈ నిషేధం అన్ని రకాల పాకిస్తానీ విమానాలపై వర్తించనుంది. అంటే వారి యాజమాన్యంలో ఉన్నా, లీజుకు తీసుకున్నా, నంబరు నమోదు చేసినా గానీ వాటన్నింటికీ ఈ పరిమితి వర్తిస్తుంది. ఏప్రిల్ 30 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. తాజాగా దీనిని మరోసారి పొడిగిస్తూ భారత అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగకపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పాక్ కూడా భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలం నుంచి వెళ్లకుండా పాకిస్థాన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని మరో నెల రోజులపాటు పొడిగిస్తూ పాక్ ఇటీవల ప్రకటించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం గగనతలం నెల రోజులు మాత్రమే మూసివేయడం సాధ్యం అవుతుంది. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.