భారత్ సమాచార్.నెట్: నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక (Rashmika) ముఖ్యపాత్రల్లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుబేరా’ (Kuberaa). ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre release event) శుక్రవారం హైదరాబాదులో జరగాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది చిత్ర యూనిట్. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విమాన ప్రమాద ఘటనపై సంతాపం తెలిపింది.
అయితే ఈ నెల 15న (ఆదివారం) ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోనే నిర్వహించనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. సేమ్ వెన్యూ, సేమ్ టైంలోనే ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మూవీని భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు ‘కన్నప్ప’ చిత్రం కూడా విమాన ప్రమాద ప్రభావంతో తన ప్రమోషన్ కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ఇప్పటికే నటుడు మంచు విష్ణు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ఈవెంట్ మరియు ట్రైలర్ విడుదల వేడుకలను శుక్రవారం ఇండోర్లో జరపాలని చిత్ర బృందం ప్రణాళిక వేసింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో, బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.