Homebreaking updates newsWTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే? 

WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే? 

భారత్ సమాచార్.నెట్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) 2023-2025 జూన్ 14తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసింది. సౌతాఫ్రికా 2023-25 టైటిల్ గెలిచిన కొద్దిసేపటికే ఈ షెడ్యూల్ విడుదలైంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్‌లో మొత్తం 9 జట్లు ఆడనున్నాయి. జూన్ 17 నుండి శ్రీలంకలోని గాలే వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌తో టెస్ట్ ఛాంపియన్ షిప్ నాలుగో ఎడిషన్ ప్రారంభవుతుంది. తాజాగా టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా 2025 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో ఈ ఎడిషన్‌లో ఆడనుంది. ఇక ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో ఆస్ట్రేలియా – 22, ఇంగ్లాండ్ – 21, భారతదేశం – 18, న్యూజిలాండ్ – 16, వెస్టిండీస్ – 14, దక్షిణాఫ్రికా – 14, పాకిస్థాన్ – 13, శ్రీలంక – 12, బంగ్లాదేశ్ – 12 టెస్టులు ఆడనున్నాయి.
టీమిండియా శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో రానున్న టెస్ట్ సైకిల్‌ను ఆడనుంది. భారత్ జట్టు తన క్యాంపెయిన్‌ను జూన్ 20న ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదికగా మొదలుపెట్టనుంది. ఈ సారి సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్‌లు ఉండటంతో ఫైనల్‌కు చేరే అవకాశాలు బలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో టీమిండియా షెడ్యూల్ చూస్తే.. ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు, వెస్టిండీస్‌తో 2 టెస్టులు, దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 2 టెస్టులు జరగనున్నాయి.
RELATED ARTICLES

Most Popular

Recent Comments