భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకొని ఓ జిమ్ ట్రైనర్ యువతిని మోసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి 2019లో హైదరాబాద్ నగరానికి వచ్చి సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసింది. 2020లో నగరంలోని గాయత్రి హిల్స్లో ఉంటున్న జిమ్ ట్రైనర్ ఆమెకు పరిచయమయ్యాడు వీరి పరిచయం ప్రేమగా మారి సహజీవనం ప్రారంభించగా, కొన్నాళ్ళకు జిమ్ ట్రైనర్ యువతిని దూరం పెట్టాడు.
15లక్షలు ఇచ్చి.. రెండో వివాహం అని తెలిసి షాక్:
దీంతో అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గ్రహించిన యువతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తన సొంత గ్రామానికి వెళ్లిపోయింది. 2023 నవంబర్లో తిరిగి హైదరాబాద్కు వచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాని చెప్పి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నించిన జిమ్ ట్రైనర్ పెళ్లికి రూ.15 లక్షలు అవసరం అవుతాయని చెప్పడంతో అతను అడిగిన డబ్బంతా యువతి చెల్లించింది. డబ్బులు తీసుకున్న జిమ్ ట్రైనర్ కొన్నిరోజులకు యువతిని మళ్లీ దూరం పెట్టడంతో అతడ గురించి ఎంక్వైరీ చేయగా అతడికి ఇంతకుముందే వివాహం జరిగిందని తెలుసుకుని మోసపోయానని గ్రహించిన యువతి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగింది. జిమ్ ట్రైనర్పై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు జిమ్ ట్రైనర్ను అరెస్టు చేశారు.
మరిన్ని కథనాలు: