Homebreaking updates newsCensus: 15 ఏళ్ల తర్వాత జనగణన.. గెజిట్ నోటిఫికేఫన్ విడుదల చేసిన కేంద్రం 

Census: 15 ఏళ్ల తర్వాత జనగణన.. గెజిట్ నోటిఫికేఫన్ విడుదల చేసిన కేంద్రం 

భారత్ సమాచార్.నెట్: దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ (Gazette notification) ను విడుదల చేసింది. రెండు దశల్లో జరగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వ జనగణన కాగా..  స్వాతంత్య్రం అనంతరం చేపట్టబోయే 8వ జనగణన. రెండు విడతలుగా జరగనున్న ఈ భారీ ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.

తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్‌ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, దేశంలో జనగణనను పదేండ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. రెండు విడుతల్లో ఈ ప్రక్రియ జరిగింది. వాస్తవానికి 2021లోనే జన గణనను నిర్వహించాలి. అయితే, కొవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.
అలాగే ఈసారి జనగణనతోపాటు కుల గణన (Caste Census) కూడా కేంద్రం చేపట్టనుంది కేంద్రం. ఇందుకోసం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. అయితే పాత విధానాలను పక్కనపెట్టి.. ఈసారి మొత్తం ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో నిర్వహించనుంది కేంద్రం. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పించనుంది. డేటా భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు కఠిన భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. సమాచారం సేకరణ, బదిలీ, నిల్వ వంటి అన్ని దశలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments