భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.200 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించిన తర్వాత ఐదురోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతితో అరెస్టు చేశారు. శ్రీధర్ నివాసం, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించి విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరీంనగర్ పట్టణంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీధర్ నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పదిరోజుల క్రితం సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా కుమారుడి వివాహం థాయిలాండ్లో చేయగా రిసెప్షన్ హల్దీ ఫంక్షన్స్ రిసాట్లల్లో పలు హోటళ్లలో నిర్వహించారు.
టాన్స్ఫర్ చేసినా అక్కడే పనిచేశాడు:
శ్రీధర్ను కస్టడీకి తీసుకొని విచారిస్తే చాలా అంశాలు బయటపడే అవకాశం ఉంటుందని భావించిన అధికారులు ఏసీబీ కోర్టులో ఐదురోజులపాటు కస్టడీ పిటీషన్ను దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు అందుకుగాను ఐదు రోజులపాటు కస్టడీని అధికారులకు ఇచ్చింది. శుక్రవారం ఉదయం శ్రీధర్ను కస్టడీకి తీసుకొని ఐదు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారించరున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బాధ్యతలు చూసిన నూనె శ్రీధర్ ఏడాదిపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసినా అక్కడే ఉండి పనిచేయడం, అందుకుగాను కాళేశ్వరంలో పనిచేస్తున్న ఈఎంసీ అనిల్ ఆదేశాల మేరకే అక్కడ ఉండి పనిచేసినట్లు అధికారులు తెలిపారు. అనిల్కు ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసినా ఎందుకు అక్కడే పనిచేశారు? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందన్న కోణంలో అధికారులు విచారించబోతున్నారు.