Homemain slidesభారతీయతకు ప్రతీక యోగా: భండారి శాంతికుమార్

భారతీయతకు ప్రతీక యోగా: భండారి శాంతికుమార్

భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: భారతీయతకు ప్రతీక యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చరిత్రాత్మక పిల్లలమర్రి వారసత్వ క్షేత్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

యోగా ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక:
పిల్లలమర్రి వంటి వారసత్వ ప్రదేశంలో యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. యోగా అనేది భౌతిక, ఆధ్యాత్మిక చైతన్యానికి చిహ్నమని, ఇది మన సంస్కృతికి మనం ఇచ్చే గౌరవం అని శాంతికుమార్ వివరించారు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదని ఇది భారతీయ ఆరోగ్యం, నియంత్రణ, అధ్యయనం, అవగాహనలకు మార్గదర్శకం అని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా ఉద్యమం ప్రపంచాన్ని కదిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు, యోగా సాధకులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular