Homemain slidesSamantha: సమంత 'రక్త్ బ్రహ్మాండ్‌'పై పుకార్లు.. మేకర్స్ క్లారిటీ

Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్‌’పై పుకార్లు.. మేకర్స్ క్లారిటీ

భారత్ సమాచార్.నెట్: సమంత.. సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ.. వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడిన సామ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతుంది. చివరగా ఖుషీ, సిటాడెల్ సినిమాలతో అలరించిన సామ్.. ఇటీవలే శుభం చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నూతన నటీనటులతో సామ్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది.

అయితే ఈ నేపథ్యంలోనే సమంత రాబోయే సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఆదిత్య రాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ “రక్త్ బ్రహ్మండ్”. రాజ్, డీకే, అనిల్ బార్వే రూపొందిస్తున్న సిరీస్ ఇది. గత కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. సిరీస్ అప్‌డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. కొంతమంది బడ్జెట్‌ సమస్యలు అంటే, మరికొందరు క్రియేటివ్‌ డిఫరెన్స్‌ అని.. ఇంకొందరు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ప్రచారంపై మేకర్స్ స్పందించారు. “ఎన్నో షెడ్యూళ్లతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నాం. ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ దాదాపు పూర్తైంది. ఆ తర్వాత భారీ అవుట్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఇందులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. వాటికి అనుకూలమైన వాతావరణం కోసం వెయిట్ చేస్తున్నాం. వర్షాలు పడే రోజుల్లో వీటిని చిత్రీకరించాలి. అలాగే పచ్చదనం కూడా అవసరం. అందుకే కొన్ని రోజులు ఆగి.. ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సిరీస్ పై వచ్చే రూమర్స్ పై క్లారిటీ వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments