Homebreaking updates newsతట్టాబుట్ట సర్దేసిన ప్రియాంక.. ముంబైలో ఆస్తుల అమ్మకం!

తట్టాబుట్ట సర్దేసిన ప్రియాంక.. ముంబైలో ఆస్తుల అమ్మకం!

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ లో నెంబర్ 1 కథానాయికగా ఎన్నో ఏండ్లు ఏలిన ప్రియాంక చోప్రా తాజాగా పెళ్లి తర్వాత తన మకాం హాలీవుడ్ కు మార్చేసింది. ప్రపంచ సుందరి కీర్తికిరీటాన్ని ధరించిన తర్వాత బాలీవుడ్ లోకి వచ్చేసిన ఈ ఇండియన్ బ్యూటీ.. బాలీవుడ్ ను బాగానే షేక్ చేసింది. నంబర్ వన్ ప్లేస్ కు చేరి కోట్టాది మంది అభిమానులను సంపాదించుకుంది. అగ్రనటులకు ధీటుగా తన అందంతో, నటనతో  ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. వరుస హిట్లతో దూసుకెళ్తుండడంతో ఆమెతో సినిమాలు చేయడానికి హాలీవుడ్ నిర్మాతలు, నటులు కూడా ఉత్సాహం చూపారు. అక్కడ సక్సెస్ కావడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సి రాలేదు ఈ బ్యూటీకి. అక్కడ అవకాశాల్ని కూడా అందిపుచ్చుకొని గ్లోబల్ స్టార్ గా అవతరించింది.

ఈ ప్రయాణంలోనే ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటుడు తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత లాస్ ఏంజిల్స్ కు తన మకాం మార్చింది. భవిష్యత్ లో ముంబై నుంచి పూర్తిగా షిఫ్ట్ అయ్యే పనిలో పడిందని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. హిందీ పరిశ్రమకు గుడ్ బై చెప్పి పూర్తిగా హాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టనుంది ఈ హాట్ భామ. ఆ వార్తలకు బలం చేకూర్చేలా.. ఇటీవల ముంబైలోని తన ఆస్తులను అమ్మకానికి పెట్టిందని బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా టాక్ నడుస్తోంది. తాను ఎంతో ఇష్టపడి డిజైన్ చేసుకున్న అంథేరిలో ఖరీదైన ఫ్లాట్ ను పది కోట్లకు అమ్మేసింది. అలాగే ఓ కమర్షియల్ ప్రాపర్టీని కూడా తాజాగా అమ్మేసింది.

హాలీవుడ్ లో కొన్ని భారీ ప్రాజెక్టులు చేతిలో రావడం, ఈ బ్యూటీ నటించిన వెబ్ సీరిస్ లు ఆదరణ పొందడంతోనే ఈ నిర్ణయం తీసుకుందని సినీ జనాల టాక్. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం కూడా ఓ కారణమై ఉండొచ్చని సినీ పండితుల విశ్లేషణ. ఏదేమైనా ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లో మరింత సక్సెస్ కావాలని ఆమె ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments