HomeUncategorizedకేరళ పీఎస్సీతో పోల్చితే టీఎస్సీపీఎస్సీ తూచ్..

కేరళ పీఎస్సీతో పోల్చితే టీఎస్సీపీఎస్సీ తూచ్..

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : కేరళ పీఎస్సీ దేశంలోనే ఇతర పీఎస్సీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతీ ఏటా జాబ్ క్యాలెంర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ వేగంగా, పారదర్శకంగా జరుగుతాయి. ఇక మన టీఎస్సీపీఎస్సీ గురించి చెప్పక్కర్లేదు. ఈ రెండింటి పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే..

మన టీఎస్సీపీఎస్సీలో 127 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 30 మంది మాత్రమే పరీక్షల నిర్వహణ చూస్తున్నారు. కనీసం 341 మంది అవసరమని గత ఐదేండ్ల కిందనే కమిషన్ అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోక గాలికి వదిలేసింది. మొన్నటి లీకేజీలతో తెలంగాణ ప్రతిష్ఠను గంగలో కలిపింది. మన దగ్గర పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కేరళ పీఎస్సీ బోర్డు విషయాలను గమనిస్తే.. అక్కడ దాదాపు 1600మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మన తెలంగాణ కంటే జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ కేరళ చిన్నది అయిన కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఇది దేశంలోనే భారీ సంఖ్య కావడం మరో విశేషం. ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తారు. పదవీ విరమణలు కాగానే వెంటనే వాటిని భర్తీ చేస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తుంటారు. ఉపాధి కల్పన కేంద్రాలను రద్దు చేసి.. వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో విలీనం చేసి జిల్లా స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేసింది. కేరళ పీఎస్సీ పరిధిలో మూడు ప్రాంతీయ కమిషన్ కార్యాలయాలు ఉన్నాయి. 14 జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. పోలీస్, పాఠశాల మినహా అన్ని పోస్టులను పీఎస్సీ భర్తీ చేస్తుంది.
ఉద్యోగాల భర్తీని రాజకీయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీని చేసి కేరళ ఎలా ఆదర్శంగా నిలిచిందో చూడండి. అలా ఉండాలి పాలన అంటే.. మరి మనవాళ్లు ఇప్పటికైనా మారుతారో లేదో చూడాలి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 4,660 ఉద్యోగాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments