భారత్ సమాచార్, AI న్యూస్ : కోట్లాది మంది యూజర్ల కోసం వాట్సాప్ మేనేజ్ మెంట్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తెస్తూనే ఉంటుంది. తాజాగా మరో అద్దిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల కళ్లకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ప్రస్తుతం బీటా వర్షన్ లో ఫీచర్ టెస్టింగ్ స్టేజీలో ఉంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్ లో డార్క్ మోడ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్ డేట్ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. ఆ ఫీచర్ గురించి తెలుసుకుందాం..
యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్ లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్ గ్రౌండ్, మెసేజ్ బబుల్స్ లో కలర్ స్కీమ్, సైడ్ బార్ ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి, తక్కువ లైట్ ను ఇచ్చే విధంగా అప్ డేట్ చేసినట్లు సమాచారం. ఈ ఫీచర్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా వాట్సాప్ ఇది వరకే 2020లో వెబ్ వర్షన్ కోసం డార్క్ మోడ్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇదే ఫీచర్ ను అప్ డేట్ చేస్తూ మరింత తక్కువ లైట్ తో పనిచేసేలా చేయనున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజీలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక రీసెంట్ గా స్టేటస్ లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్ లకు ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ ను షేర్ చేసే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తే ల్యాప్ టాప్, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. స్టేటస్ అప్ డేట్ సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్ కు సంతృప్తిని ఇచ్చాయనే చెప్పాలి.