Homebreaking updates newsతండ్రి పాత్రకు రూ.30 లక్షలు..అప్పట్లో ఇది పెద్ద రికార్డు

తండ్రి పాత్రకు రూ.30 లక్షలు..అప్పట్లో ఇది పెద్ద రికార్డు

భారత్ సమాచార్, సినీ టాక్స్ : 1996లో వచ్చిన ఓ టాలీవుడ్ సినిమా కోసం హీరో తండ్రి పాత్రకు రూ.30 లక్షలు ఇచ్చారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది. ఆ సినిమా పేరు వజ్రం. హీరో నాగార్జున, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, రోజా కాంబినేషన్ లో వచ్చింది. అయితే ఈ సినిమాలో నాగార్జున తండ్రి పాత్రకు కథలో చాలా ప్రాధాన్యముంటుంది. అయితే ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుందామా? అని కృష్ణారెడ్డి తెగ ఆలోచించారట. చాలా మంది ఆయన మైండ్ లో వచ్చిన ఎవరూ అంతగా నప్పలేదట. ఇక దీంతో ఆ పాత్ర కోసం డైరెక్టర్ కె.విశ్వనాథ్ ను అడుగుదామని.. నాగార్జునకు చెప్పగా ఆయన ఓకే అన్నాడట. విశ్వనాథ్ దగ్గరకు వెళ్లిన కృష్ణారెడ్డి ఈ పాత్రకు మీరైతే బాగుంటుంది..చేయాలని బతిమాలరట. దానికి విశ్వనాథ్ నా సినిమాలతోనే బిజీగా ఉన్నా..చేయనంటే చేయను అన్నాడట. అయితే కృష్ణారెడ్డి మాత్రం ఆయనతోనే చేయించాలని ఫిక్స్ అయ్యాడు. మరోసారి ఆయన్ను కలిసి బతిమాలాడు. దీంతో ఓ 30లక్షలు ఇస్తే చేస్తా అని.. చెప్పేశాడు. అయితే కృష్ణారెడ్డి బారి నుంచి తప్పించుకోవడానికి విశ్వనాథ్ అలా చెప్పారు.

అయినా కృష్ణారెడ్డి పట్టువీడలేదు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఆ పాత్రకు ఆయనైతేనే సూట్ అవుతారు.. రూ.30లక్షలు ఇచ్చినా పర్వాలేదని నాగ్ ను, నిర్మాతను ఒప్పించాడు. ఇక రూ.30లక్షలు ఇచ్చి విశ్వనాథ్ ను తండ్రిపాత్రకు లాక్ చేసేశారు. తండ్రి పాత్రకు అంత పెద్ద మొత్తం ఇవ్వడంతో ఆ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా అంత భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న వారు లేరు. ఆ సినిమాలో విశ్వనాథ్ క్యారెక్టర్ అద్భుతంగా పండింది. కానీ సినిమా మాత్రం పెద్దగా వర్క్ వుట్ కాలేదు.

మరికొన్ని సినీ కథనాలు...

వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments