Homebreaking updates newsఈజీ మనీ పేరుతో రూ.3,700 కోట్ల బిగ్గెస్ట్ స్కాం

ఈజీ మనీ పేరుతో రూ.3,700 కోట్ల బిగ్గెస్ట్ స్కాం

భారత్ సమాచార్, క్రైమ్ : ఇటీవలి కాలంలో ఆన్ లైన్  ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి అందరికి తెలిసిందే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఈ స్కామ్స్ చోట్లకి వ్యాపిస్తున్నాయి. విద్యార్థి, నిరుపేద, ధనికులు అందరూ కూడా డబ్బు మీద ఆశతో స్కామ్స్ కి గురవుతున్నారు. ఇటీవలి కాలం మరొక భారీ స్కాం భారతదేశంలో వెలుగు చూసింది. 7 లక్షల మందిని మోసగించన ఓ ముఠా వారి నుంచి రూ.3,700 కోట్ల నగదును దోచుకున్నారు.  యూపీలోని నోయిడాలో సెక్టార్ 63లో అనుభవ్ మిట్టల్, శ్రీధర్ ప్రసాద్, మహేశ్ దయాల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.500 కోట్లు నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కామ్ వివరాల గురించి…

నోయిడాలో ‘‘సోషల్ ట్రేడ్. బిజ్’’ అనే పోర్టల్ ను 2015లో పై ముగ్గురు ప్రారంభించారు. దీని కింద ఒక పెట్టుబడి దారుడు సభ్యత్వం పొందడానికి కంపెనీ ఖాతాలో నాలుగు ప్యాకేజీల కింద రూ.5,750 నుంచి 57,500వరకు ఏ టర్మ్ లోనైనా చెల్లించవచ్చు. దీనిలో పెట్టుబడిదారుడికి ఒక్క క్లిక్ కు రూ.5 సంపాదిస్తారు.

కంపెనీకి డబ్బు చెల్లించిన తర్వాత పెట్టుబడిదారులు పేజీలను లైక్ చేయాలని, వారు పంపిన లింక్ లపై క్లిక్ చేయాలని కోరారు. కంపెనీ ప్రతి క్లిక్ కు రూ..6 సంపాదించిందని, అందులో పెట్టుబడి దారులకు రూ.5 ఇచ్చారు. అయితే కంపెనీ పంపిన లింకులు నకిలీవని పోలీసులు తెలిపారు.

సదరు సంస్థ నోయిడాలోని అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేయబడింది. నిందితులు నిరంతరం పోర్టల్ పేరును మార్చేవారు. ఇప్పటివరకు ఆ సంస్థ దాదాపు 6.5లక్షల మందిని మోసం చేసి సుమారు రూ.3,700 కోట్లు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు.

మరికొన్ని క్రైమ్ లైన్స్…

రోజుకో సూసైడ్.. అస్సలేం జరుగుతుంది..?

RELATED ARTICLES

Most Popular

Recent Comments