Homemain slidesతెలంగాణ పై కాషాయ ఫోకస్...

తెలంగాణ పై కాషాయ ఫోకస్…

భారత్ సమాచార్, రాజకీయం : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లే లక్ష్యంగా బీజేపీ పార్టీ భారీ స్థాయిలో పావులు కదుపుతోంది. ఈ సారి సౌత్ లో ప్రత్యేకంగా తెలంగాణ ను స్ఫెషల్ ఫోకస్ చేస్తోంది కాషాయ పార్టీ. నిన్న భాగ్యనగరానికి అమిత్ షా వచ్చి ఇదే విషయాన్ని వెల్లడించారు. బూత్ లెవల్ ఏజెంట్లకు ఎన్నికల దిశా నిర్దేశం చేసి వెళ్లారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో ఓట్లు సంపాదించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రతి ఏటా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత ఎన్నికల ముందు ఈ విషయం బీజేపీకి గుర్తు వచ్చింది.

తాజాగా భాజపా అధినాయకుడు మోడీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు విజయ సంకల్ప యాత్రలో పర్యటించనున్నారని తెలిపారు. మోడీ, అమిత్ షా లే కాకుండా కాషాయ పార్టీ ఉన్నత స్థాయి నాయకులంతా ఈ సారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోడీ మార్చి 15న మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొంటారు. 16వ తేదీన నాగర్ కర్నూల్ సభలో పాల్గొంటారు. 18వ తేదీన జగిత్యాలలో భారీ విజయ సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

మరికొన్ని రాజకీయ కథనాలు...

మహిళల భద్రత కోసం T-SAFE యాప్

RELATED ARTICLES

Most Popular

Recent Comments