Homemain slidesరూ.100కోట్ల అవినీతిలో కవితకు భాగస్వామ్యం

రూ.100కోట్ల అవినీతిలో కవితకు భాగస్వామ్యం

భారత్ సమాచార్, ఢిల్లీ ; బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ నేడు ఢిల్లీ నుంచి సంచలన ప్రకటన విడుదల చేసింది. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించాం, ఆ సమయంలో ఆమె బంధువులు, అసోసియేట్స్ తమ విధులకు ఆటంకం కలిగించారని తెలిపింది.మార్చి 17వ తేదీతో విడుదల చేసిన ప్రకటనను 18వ తేదీన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.

”దిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన రూ.100 కోట్ల ముడుపులలో కవిత వాటా ఉంది. 2021-22 సంవత్సరంలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. తర్వాత హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది” అని ఈడీ ప్రకటనలో పేర్కొంది.

”ఇందులో హైదరాబాద్, ముంబయి, చెన్నై సహా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ.128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశాం” అని ఈడీ వెల్లడించింది.

దిల్లీలోని స్పెషల్ పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టు అనుమతి మేరకు ఈ నెల 23వ తేదీ వరకు కవితను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మద్యం కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments