Homemain slidesమీకు జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?

మీకు జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు గ్యారంటీల అమలు చేయటం పై భారీగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం కింద తెలంగాణ రాష్టంలోని ప్రతి ఇంటికి (కొన్ని షరతులతో ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు కూడా) 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిచే ఏర్పాటు చేస్తున్నారు విద్యుత్ అధికారులు. అయితే గ్రౌండ్ లెవల్లో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు పరచటానికి స్థానిక యంత్రాంగం కొన్ని ఇబ్బందులను ఎద్కుర్కొంటోంది. ఈ పథకానికి అర్హులై ఉన్నా కూడా కొద్దిమందికి టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా జీరో కరెంటు బిల్లు రావటం లేదు. అటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో ఈ ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో తెస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రక్రియను ఇక నిరంతరం కొనసాగిస్తునట్టు సర్కారు పేర్కొంది. అర్హులైన వారు తమ వివరాలను ఈ ప్రత్యేక కౌంటర్లలో సరిచేసుకోవాలని సూచించిది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

జర్మనీలో ఉద్యోగం వదిలి..కరీంనగర్ లో హోటల్ పెట్టాడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments