భారత్ సమాచార్ ; ఐపీఎల్-17 సీజన్ కి చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని తప్పుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభమవ్వటానికి కేవలం ఒక రోజు ముందు ఈ విషయం చెప్పటంతో తల ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సారికి ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ భాద్యతలు చేపట్టనున్నాడు. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశం ఉంది. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఐదు ట్రోఫీలను గెలుచుకుంది. రేపు చెన్నై-బెంగళూరు మధ్య ఈ సీజన్ మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. నేడు ఐపీఎల్-17 ట్రోఫీతో అన్ని జట్ల సారథులు కలిసి ఫోటో దిగారు.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
RELATED ARTICLES