భారత్ సమాచార్, ఆదిలాబాద్: రంజాన్ పండుగ త్యాగానికి, మతసమరస్యానికి ప్రతీక. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సిన రంజాన్ పండుగలో కత్తుల దాడి కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ పట్టణంలో రంజాన్ పర్వదినాన ఒకే వర్గానికి చెందిన యువకుల మధ్య తలెత్తిన గొడవ చినికి చినికి గాలి వానగా మారి.. కత్తులతో ఘర్షణకు దిగడం సంచలనం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించి ఓ వర్గానికి చెందిన యువకుల మధ్య డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ కత్తుల దాడికి దారి తీసింది. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
టీ తాగుతుండగా కత్తులతో దాడి:
గురువారం సాయంత్రం 4.30గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపూర పాఠశాల సమీపంలో ఐదుగురు యువకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కోలిపూరకు చెందిన అన్నదమ్ములు సయ్యద్ ముజాయిద్, సయ్యద్ షాహిద్లు ఓల్డ్ బస్టాండ్ సమీపంలోకి ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా.. అక్కడికి వచ్చిన పజ్జు అనే యువకుడు ఆ ఇద్దరు అన్నదమ్ములతో గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో వారి ఇద్దరిపై దాడికి పాల్పడి పరారయ్యాడు. ఈ దాడిలో ముజాయిద్కు కడుపులో, కుడి చెయ్యికి గాయాలయ్యాయి. అడ్డువచ్చిన తమ్ముడికి సైతం స్పల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు రిమ్స్ వైద్యులు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేపట్టినట్టు ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
మరిన్ని కథనాలు: