Homemain slidesప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చి

ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చి

భారత్ సమాచార్, వైఎస్సాఆర్ కడప: వివాహేతర సంబంధాలతో భర్తను హత్య చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. పచ్చని కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ప్రియుడు మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చి చివరికి కటకటాలపాలైంది. భర్తను చంపాలని నిర్ణయించుకుని అతనిపై రూ.20లక్షలు ఇన్సూరెన్స్ చేయించింది. ప్రియుడితో కలిసి కాటికి పంపించి యాక్సిడెంట్‎గా చిత్రీకరించింది.

ఇన్సూరెన్స్ చేయించి పక్కా ప్లాన్ వేసి:
వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మాధవి అనే మహిళ ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రశాంతినగర్‌లో నివాసం ఉంటున్న తన భర్త రాంబాబును ప్రియుడు భరత్‎తో కలిసి హత్య చేసింది. భరత్‎తో తనకున్న వివాహేతర సంబంధం భర్త రాంబాబుకు తెలియడంతో రాంబాబు రోజు మాధవిని చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి పక్కా స్కెచ్ గీసింది. భర్తను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత రాంబాబు‎పై రూ.20లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించింది. మాధవి తన తల్లి సపోర్టు కూడా తీసుకొని మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రాంబాబును హత్య చేసింది.

హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి:
భార్య మాధవి తన భర్త రాంబాబును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులకు మాధవి తీరుపై అనుమానం రావడంతో కేసును పూర్తిగా దర్యాప్తు చేయగా అసలు హంతకురాలు భార్యేనని పోలీసులు తేల్చారు. ఆమెకు ప్రియుడు భరత్, మాధవి తల్లి కూడా సహకరించారని వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తుల సహాయం తీసుకొని భర్తను యాక్సిడెంట్ చేయించి చంపించిందని జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. వివాహేతర సంబంధంతో రాంబాబును భార్యే హత్య చేసిందని, చంపేముందు భర్తపేరుపై రూ.20లక్షల ఇన్సూరెన్స్ చేయించిందని డీఎస్పీ వివరాలు వెల్లడించారు. హత్యకు ఆమె తల్లి, ఆమె ప్రియుడు మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారని డీఎస్పీ తెలిపారు. మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రశాంతి నగర్ నివాసం ఉంటున్నాడని, గత రెండు సంవత్సరాలుగా మృతుని భార్య మాధవితో భరత్ బాబు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు భార్యను మానసికంగా వేధింపులకు గురిచేస్తుండటంతో భార్య మాధవి ఆమె తల్లి కలిసి రాంబాబును అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం రాంబాబును హత్య చేసినట్లు వివరించారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించారని నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

మరిన్ని కథనాలు:

ఈజీ మనీ పేరుతో రూ.3,700 కోట్ల బిగ్గెస్ట్ స్కాం

RELATED ARTICLES

Most Popular

Recent Comments