భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
21వ శతాబ్దాన్ని కరోనాకి ముందు, తర్వాత అనేంతలా మానవాళి జీవితాలపై ప్రభావం చూపింది ఈ భయంకర మహమ్మారి. ఐక్యరాజ్యసమితి అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు బలితీసుకుంది ఈ భయంకర వైరస్. కోవిడ్-19 మిగిల్చిన చేదు అనుభవాలు ఇంకా మర్చిపోక ముందే మరో కొత్త రకం వేరియంట్ మానవాళిపై తన పంజా విసరటానికి సిద్ధం అవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా సింగపూర్ లో కొవిడ్-19 కొత్త వేరియంట్ కోరలు చాచింది. కేవలం వారం రోజుల్లోనే దాదాపుగా 26వేల మందికి పైగా ఈ నయా కరోనా వైరస్ వేరియంట్ బారిన పడినట్లు తెలుస్తోంది. కేవలం గత వారం రోజుల్లోనే 25,900 కొత్త కేసులు నమోదైనట్టు సింగపూర్ వైద్యారోగ్యమంత్రి కుంగ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తరచుగా చేతులు కచ్చితంగా శుభ్రం చేసుకోవాలని సూచించారు.