Homemain slidesఆ రోజున రైతుల ఖాతాల్లో నగదు జమ

ఆ రోజున రైతుల ఖాతాల్లో నగదు జమ

భారత్ సమాచార్, జాతీయం ;

2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమలులో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఐదో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ పథకాల ద్వారా నగదును జమ చేసే కార్యక్రమాలకు బ్రేక్ వేసింది. తాజాగ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.

పీఎం కిసాన్ 17వ విడత నిధుల జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ప్రస్తుతానికి ఈ నిధుల విడుదల పైన కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలు పూర్తయిన తరువాత జూన్ తొలి వారంలోనే నిధుల జమ చేసేలా అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో రైతుల నిరీక్షణ ఫలించనుంది.

17వ విడత నిధులు

కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తూ వస్తోంది.

ఎన్నికలు పూర్తవ్వగానే

ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. రూ.2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతాయా అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో కేంద్రం అధికారికంగా నిర్ణయం వెల్లడించలేదు.

జూన్ తొలి వారంలో

ఎన్నికలు పూర్తయిన తరువాత జూన్ 2న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్లో జమ అవుతుందని..లబ్దిదారుని బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఈ- కేవైసీ పూర్తి చేసేందుకు అధికారిక వెబ్ సైట్ ద్వారా రైతులు అవసరమైన సమాచారం ఇచ్చి పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా రైతులు ఈ కేవైసీ పూర్తి చేసారు. ఇక, మిగిలిన వారు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయండి

RELATED ARTICLES

Most Popular

Recent Comments