Homebreaking updates newsఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

భారత్ సమాచార్, ఛత్తీస్ ఘడ్ ;

ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లా లో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది ఆదివాసీలు మృతి చెందినట్లు నిర్దారించారు. తునికాకు సేకరణ కోసం వెళ్లిన ఆదివాసీలు ప్రయా ణిస్తున్న వ్యాను వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలో పడింది. ప్రయాణ సమయంలో ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నారని స్థానికులు తెలిపారు. అందరూ తునికాకు సేకరణ ముగించుకొని తిరిగి సెమ్హార గ్రామం వస్తున్న సమయం లో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే కవర్థ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మృతి చెందిన వారిలో 14 మంది మహిళలు, నలుగు రు పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజరు శర్మ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలి పారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రుణ మోసం ఇది

RELATED ARTICLES

Most Popular

Recent Comments