Homebreaking updates newsశనివారం తిరుమలలో పోటెత్తిన భక్తులు

శనివారం తిరుమలలో పోటెత్తిన భక్తులు

భారత్ సమాచార్, తిరుమల ;

సార్వత్రిక ఎన్నికల తర్వాత వారాంతపు సెలవలు కలసి రావటంతో కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. రోడ్డు, నడక మార్గంలో కూడా భారీ రద్దీ నెలకొంది. కడపటి వార్తాలు అందే సమయానికి తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే సాధారణ భక్తుల కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో కూడా భక్తులు వేచివున్నారు.  స్వామి వారి దర్శన టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శ నం కోసం దాదాపుగ 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 70,668 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38036 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో రూ. 3. 64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.

మరికొన్ని తాజా విశేషాలు…

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments