HomeUncategorizedపాలిటెక్నిక్ చేయాలనుకునే విద్యార్థులకు చివరి అవకాశం

పాలిటెక్నిక్ చేయాలనుకునే విద్యార్థులకు చివరి అవకాశం

భారత్ సమాచార్, విద్య ;

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పాలిటెక్నిక్ ప్రవేశాలకోసం చివరి దశ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య వెల్లడించారు. ఏపీ పాలిసెట్ – 2024లో అర్హత పొంది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలన్నారు. సర్టిఫికేట్ ధృవీకరణ, ఎంపికల నమోదు ప్రక్రియల కోసం జూలై 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమయం కేటాయించామని తెలిపారు. జూలై 16వ తేదీన సీట్ల కేటాయుంపు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్ కోసం https://appolycet.nic.in అధికారిక వెబ్‌సైట్‌లోని వివరణాత్మక నోటిఫికేషన్ ను పరిశీలించాలని డాక్టర్ నవ్య విద్యార్థులను స్పష్టం చేశారు. సెల్ఫ్ జాయినింగ్ , రిపోర్టింగ్ కోసం జూలై 18 నుండి 20 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం రెగ్యులర్ తరగతులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. పాలిటెక్నిక్ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

పశు సంవర్థక పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments