భారత్ సమాచార్, చంద్రగిరి ;
సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యే దగ్గర దోపిడీకి పాల్పడ్డారు కేటుగాళ్లు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు కి సీబీఐ అధికారులమంటూ ఫోన్ కాల్ చేశారు మోసగాళ్లు. పాకాల దగ్గర మనీ లాండరింగ్ జరిగిందని, అందులో మీ పేరు కూడా ఉందని పేర్కొన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వారెంట్ కూడా జారీ అయిందని ఆయనను భయపెట్టారు. మీ బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బునంతా మేము చెప్పే అకౌంట్ లోకి వేయాలని లేకపోతే వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించారు దోపిడిదారులు.
వారి మాటలు నమ్మిన మాజీ ఎమ్మెల్యే ఆయనకు గల నాలుగు ఎస్బీఐ అకౌంట్ లు నుండి మరియు రెండు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ల నుండి మొత్తం 48,49000/- నగదును వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఆన్ లైన్ ద్వారా బదిలీ చేశారు. నగదు లావాదేవీ పూర్తి అయిన తర్వాత వారి నుంచి ఎటువంటి కాల్ రాలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన మాజీ ఎమ్మెల్యే సమీపంలోని పోలీసు స్టేషన్ వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు.