భారత్ సమాచార్, బిహార్ ;
బిహార్ లోని ట్రాన్స్ జెండర్లు నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. భారతదేశ చరిత్రలోనే తొలి సారిగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఎస్ ఐ లు ఉద్యోగం సాధించి చరిత్ర సృష్టించారు. బిహార్ పోలీసు కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించారు. పోలీసు ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నారు. బిహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరు ట్రాన్స్మెన్ పుట్టుకలో ఆడ కాగా ఒకరు ట్రాన్స్ఉమెన్,పుట్టుకలో మగ వారుగా ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఒక్కో ట్రాన్స్జెండర్ మాత్రమే పోలీసు ఉద్యోగం సాధించారు. ఇతర అభ్యర్థులతో సమానంగా కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్స్ కి సమాజంలోని పలు వర్గాల వారు అభినందనలు తెలుపుతున్నారు.
మరి కొన్ని తాజా వార్తా విశేషాలు…