Homemain slides‘తల్లికి వందనం’ పథకానికి అర్హతలు

‘తల్లికి వందనం’ పథకానికి అర్హతలు

భారత్ సమాచార్, అమరావతి ;

పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ అనే సంక్షేమ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుందని, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నుంచి నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. అయితే లబ్దిదారులకు ఈ పథకం అందించటానికి ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను పాటిస్తోంది, అవేంటో మనమూ తెలుసుకుందాం…

తల్లికి వందనం పథకం… అర్హతలు-అనర్హతలు

  • 1️⃣. మొత్తం కుటుంబ ఆదాయం :

గ్రామీణ ప్రాంతాలలో మొత్తం కుటుంబ ఆదాయం నెలకు రూ. 10000/- లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతాలలో అయితే నెలకు రూ. 12000/-ల లోపు ఉండాలి.

2️⃣. మొత్తం కుటుంబానికి గల భూమి:

3 ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10 ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్ఠంగా 10 ఏకరాలు లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు

3️⃣. తల్లి లేదా లబ్దిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలు

తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

4️⃣. ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్ దారులు :

కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది.

5️⃣. నాలుగు చక్రాల వాహనం :

లబ్దిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).

6️⃣. విద్యుత్ వినియోగం :

గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు.

7️⃣. ఆదాయపు పన్ను :

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.

8️⃣. పట్టణాల్లో ఆస్తి :

మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అ ల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).

🔟. పుట్టిన తేదీ ధ్రువీకరణ :

ఆధార్ కార్డు / సమీకృత ధృవీకరణపత్రం

1️⃣1️⃣. బ్యాంకు ఖాతా వివరాలు :

తల్లి/ లబ్దిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి.

1️⃣2️⃣. హాజరు శాతం :

విద్యార్థులు కచ్చితంగా ఒక విద్యా సంవత్సరంలో 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.

మరికొన్ని ప్రత్యేక అంశాలు…

ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల వివ‌రాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments