Homemain slidesకొత్త కారులో యువతితో వెళ్తూ.. చివరికి ?

కొత్త కారులో యువతితో వెళ్తూ.. చివరికి ?

భారత్ సమాచార్.నెట్, కాకినాడ: కొత్త కారు.. ఫస్ట్‌ డ్రైవ్‌.. ఇక మాములుగా ఉండదంటూ లాంగ్ డ్రైవ్‌కు బయలుదేరాడు. ఫుల్లుగా మద్యం తాగి ఎఫ్‌ఆర్ కారులో రయ్యిరయ్యిన దూసుకెళ్లాడు. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. ఈ నెత్తుటి బీభత్సం కాకినాడలోని కల్పనా సెంటర్‌లో చోటుచేసుకుంది. కొత్త కారు కొన్న రామ్మోహన్‌ మందుకొట్టి కాకినాడ బీచ్‌ రోడ్డులో డ్రైవ్ చేశాడు. యమా స్పీడులో ఉన్న కొత్త కారు అదుపుతప్పి రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఆ స్పీడ్‌కి కారు కూడా పల్టీలు కొట్టింది. కారులో రామ్మోహన్‌తోపాటు, మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

దిమ్మెను ఢీకొట్టి అంతటితో ఆగకుండా:
మద్యం సేవించి ఎఫ్ ఆర్ కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న యువతీ, యువకుడు వెళ్తూ అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టిందని.. ఆ తర్వాత బైక్ ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు మృతిచెందగా కారులో ఉన్న వారికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని సతీష్‌, లక్ష్మణ్‌గా గుర్తించారు. రామ్మోహన్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని కథనాలు:

ఇది వేరే లెవల్ హైడ్రామా

RELATED ARTICLES

Most Popular

Recent Comments