భారత్ సమాచార్, నేటి ప్రత్యేకత ;
నేడు ప్రపంచ హృదయ❤️ దినోత్సవం
ప్రముఖుల జననాలు
1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త.
1901: ఎన్ రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత
1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు
1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
1947: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి.
1985: అంజనా సౌమ్య, జానపద, సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
1970: కుష్బూ, ఒక భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
ప్రముఖుల మరణాలు
1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).
1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
2007: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920)
2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
2008: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934).
2014: పైడి తెరేష్ బాబు, కవి (జ.1963).
2020: కె.సి.శివశంకరన్, “శంకర్” గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924)
చరిత్రలోని ప్రముఖ సంఘటనలు
1959: ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు.
1962: కలకత్తాలో బిర్లా ప్లానెటోరియం మొదలయ్యింది.
1981: భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్కు హైజాక్ చేశారు.
2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.