భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం;
నేటి ప్రత్యేకం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం.
అంతర్జాతీయ అంధుల ఆసరా దినం.
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం.
ప్రముఖుల జననాలు
1881: పి.జి.ఉడ్హౌస్, ఆంగ్ల హాస్య రచయిత.
1889: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు.
1920: మారియో పుజో, గాడ్ఫాదర్ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత.
1908: జాన్ కెన్నెత్ గాల్బ్రెత్, ఆర్థికవేత్త.
1920: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత.
1926: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త
1927: పర్దుమన్ సింగ్ బ్రార్, షాట్పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు.
1931: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి.
1953: మాగుంట శ్రీనివాసులురెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.
1964: పేడాడ పరమేశ్వరరావు, ప్రముఖ రచయిత, భాషావేత్త, పాత్రికేయుడు, విద్యావేత్త.
1987: సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, “మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడు.
ప్రముఖుల మరణాలు
1918: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు.
1937: నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్.
1982: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు.
2014: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు.
ప్రముఖ చారిత్రక సంఘటనలు
1582: పోప్ గ్రెగరీ-13 గ్రెగరియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా చర్చి ప్రకటించింది. ఆ రకంగా మధ్యలో పదిరోజులను కావాలనే తప్పించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే.
2009 :ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఎ.బి.ఎన్ అంటే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్..
1932: దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (‘టాటా సన్స్ లిమిటెడ్’) ప్రారంభమైంది.
1949: బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్ భారత్లో విలీనమయ్యాయి.
1992: ఎయిర్ ఇండియా విమానం: కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్కు బ్రిటన్ అత్యున్నత సాహితీ పురస్కారం ‘బుకర్స్ ప్రైజ్’ లభించింది.