భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు
1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు.
1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు.
1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి.
1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.
1906: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
1925: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత.
1933: అమర్త్య సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త.
1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలకు చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి.
1936: రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు.
1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.
1949: అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు.
1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.
1956 : కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు.
1963: పైడి తెరేష్ బాబు, కవి.
1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి.
ప్రముఖుల మరణాలు
1998: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త.
చరిత్రలో ప్రముఖ సంఘటనలు
1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.
1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.