భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు
1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
1889: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు.
1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు.
1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత, స్క్రిప్టు రచయిత
1929: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్
1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత.
1944: పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.
ప్రముఖుల మరణాలు
1980: కె.సభా (సభాపతి), కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త.
2007: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు.
చరిత్రలోని ప్రముఖ సంఘటనలు
1869: నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.
2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్ కుమార్ షిండే నియమితుడయ్యాడు.
1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్రపురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.
1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.